Thursday, October 22, 2020

గుడివాడ, 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన పట్టణం.
పిన్ కోడ్ నం. 521 301.,
 ఎస్.టి.డి.కోడ్ = 08674.

గుడివాడ పట్టణ చరిత్ర ....
ఒకప్పుడు కళింగ రాజు పరిపాలనలో 'గుడివాడ' ఆంధ్రనగరం పేరుతో ప్రసిద్ధి చెందింది. రాజ్య విస్తరణలో భాగంగా అశోకుడు, కళింగ రాజు పై దండెత్తి ఓడించాడు. అప్పటి వరకు కళింగ రాజు పాలనలో వున్నా ఆంధ్ర ప్రజలు, యుద్ధంలో గెలిచిన అశోక చక్రవర్తిని రాజుగా అంగీకరించారు. క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బై మూడు నాటికి అశోకుడు పరిపాలించే కాలంలో ఆంధ్ర నగరాలు మూడు పదులు వున్నై. కృష్ణాతీరంలో అశోకుని కాలానికి ఎన్నో బౌద్ధ కేంద్రాలు ప్రసిద్ధి చెందాయి. ఆ కాలంలో కృష్ణా నదికి ఇరువైపులా వున్నా పరచిన గ్రామాలన్నీ బౌద్ధ క్షేత్రాలే.

అమరావతి, భట్టిప్రోలు, నాగార్జునకొండ, జగ్గయ్య పేట, బోడపాడు, చందోలుతో 'గుడివాడ ' కూడా బౌద్ధ కేంద్రాలుగా గుర్తింపబడ్డాయి. కృష్ణా నది తీరంలో బౌద్ధ స్థూపాలను నిర్మించటానికి, బౌద్ధ మతం ప్రచారం పొందటానికి అశోకుడే కారణం. బుద్ధుని అస్తికలను నిక్షిప్తం చేసి, మహా చైత్యాలుగా మార్చాడు. చైత్యం అంటే 'చితి' కి సంబంధించిన ఎముకలని నిక్షిప్తం చేసిన స్తూపం. 1984 లో 'రీ' అనే పరిశోధకుడు, దాక్షిణాత్య బౌద్ధ శిల్పాలు - భట్టిప్రోలు, ఘంటసాల, గుడివాడ పురాతన స్తూపాలు' అన్న నివేదిక సమర్పించాడని, ఆ నివేదికను పుణీలో నార్ల వారు చదివానని చెప్పగా తెలిసింది. అందులో గుడివాడ 'దీపాల దిబ్బ' లో దొరికిన విదేశీ నాణాలు, బౌద్ధ క్షేత్ర ప్రాచీనతని తెలియ చేస్తోంది.

గుడివాడ పేరు వెనుక చరిత్ర 
కలువ పూలతో నిండి ఉన్న ఒక కొలను
గుడివాడని పూర్వం గుళ్ళవాడ అనేవారు. అది కాలక్రమేన గుడివాడగా మారింది. ఈ పట్టణములో చాలా గుడులు ఉన్నాయి.

గుడివాడ పట్టణ భౌగోళికం సవరించు
సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప పట్టణాలు
గుడివాడ, 
హనుమాన్ జంక్షన్,
 పెడన, 
ఏలూరు

సమీప మండలాలు 
నందివాడ, పెదపారుపూడి, గుడ్లవల్లేరు, పామర్రు.ముడినేపల్లి.

రవాణా సౌకర్యాలు...
గుడివాడ పట్టణము నుండి దగ్గర, దూర అన్నిప్రాంతముల వైపులకు బస్సు, రైలు తదితర రవాణా సౌకర్యములు ఉన్నాయి.
గుడివాడ ప్రాంతము నుండి భీమవరం, రాజొలు, నర్సాపురం, విశాఖపట్నం, బెజవాడ, తిరుపతి, బెంగులురు, హైదరాబాదు, మచిలీపట్నం రైల్వే, బస్ వసతులు ఉన్నాయి.
ఈ పట్టణము నుండి దాదాపుగా 30-35 కి.మీ. దగ్గరలో గన్నవరం విమానాశ్రయము ఉంది.
రైలు వసతి 
గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ లో నిలిచి, బయలు దేరుటకు సిద్దముగా ఉన్న సికింద్రాబాద్ - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్
గుడివాడ రైల్వే జంక్షన్.
గుడివాడ - విజయవాడ - భీమవరం - నరసాపురం - మచిలీపట్నం రైల్వే ట్రాక్ డబుల్, విధుయుతీకరణ లేక పోవటం ప్రధాన సమస్య.
గుడివాడ ప్రాంతం నుండి తిరుపతి, విశాఖపట్నం, ముంబై, షిరిడి, పురి, భిలాసాపూర్, భువనేశ్వర్, విజయవాడ, హైదరాబాదు రైళ్లు ఉన్నాయి.
గుడివాడ - విజయవాడ - భీమవరం - నరసాపురం - మచిలీపట్నం రైల్వే ట్రాక్ డబుల్ ట్రాక్ పనులు మొదలపెట్టేరు
సాధారణ బండ్లు 
గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషనులో నిలిచి ఉన్న ఒక ప్యాసింజర్ రైలు.
విజయవాడ - గుడివాడ ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77213
విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77215
విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77206
గుంటూరు - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57381
విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77212
గుడివాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77219
విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77207
విజయవాడ - గుడివాడ ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77201
విశాఖపట్నం - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57230
రైళ్లు వివరములు :
17049 - మచిలీపట్నం నుండి సికందరాబాద్.
17255 - నరసాపురం నుండి హైదరాబాదు.
17213 | 17231 - నరసాపురం నుండి నాగర్సొల్.
17210 - కాకినాడ నుండి బెంగళూరు.
17644 - కాకినాడ నుండి చెన్నపట్నం.
18519 - విశాఖపట్నం నుండి ముంబాయి.
17015 - విశాఖపట్నం నుండి హైదరాబాదు.
17404 - నరసాపురం నుండి తిరుపతి.
17479 - పూరి నుండి తిరుపతి.
17481 - భిళాస్పుర్ నుండి తిరుపతి.
గుడివాడ, వెంట్రప్రగడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. ఇదిరిఅల్వెజంక్షన్ విజయవాడ రైల్వేస్టేషన్: 44 కి.మీ

గుడివాడ పట్టణంలోని విద్యా సౌకర్యాలు 
గుడివాడ పట్టణంలోని మౌలిక సదుపాయాలు 
గుడివాడ పట్టణ పరిపాలన 
గుడివాడ పట్టణములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు సవరించు
శ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయం సవరించు
శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం సవరించు
ఇక్కడ ఉన్న శ్రీ వెంకటేశ్వర వారి ఈ దేవాలయము ప్రసిద్ధి కల దేవాలయము. ఇక్కడ స్వామి వారి కల్యాణము ఒక పేద్ద మహొత్సవంలా జరుగుతాయి. ఈ ఆలయంలో, 2014, నవంబరు-3, సోమవారం నుండి, 6వ తేదీ గురువారం వరకు, స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, 6వ తేదీ గురువారం నాడు, స్వామివారికి స్నపనం, విశేష అలంకరణ, వేదవిన్నపం, చతుస్థానార్చన, సర్వ ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించారు. ద్వారతోరణబలి, మహా పూర్ణాహుతి, పవిత్ర అవరోహణం, అనంతరం 108 కలశాలతో క్షీరాభిషేకం నిర్వహించారు. మన గుడి కార్యక్రమం క్రింద తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం అన్నదానసత్రంలో కార్తీక వనసమారాధన నిర్వహించారు.
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, జ్యేష్ఠమాసంలో, శుద్ధ దశమి నుండి పౌర్ణమి వరకు వైభవంగా నిర్వహించెదరు. 
శ్రీ నాగమ్మ తల్లి దేవాలయము సవరించు
సింగరెపాలెం నాగమ్మ తల్లి దేవాలయము బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయము. ఇక్కడకి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న నాగమ్మ తల్లి బాగా మహిమ కల దేవతగా ఇక్కడ ఉన్న ప్రజలు కొలుస్తారు.

శ్రీ ఉమానాగలింగేశ్వరస్వామివారి ఆలయం సవరించు
ఈ ఆలయంలో 2014, నవంబరు-6వ తేదీ రాత్రి, కార్తీకపౌర్ణమి సందర్భంగా, నాలుగున్నర కోట్ల దీపాలతో దీపోత్సవాన్ని నిర్వహించారు. పురవీధులలో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. భక్తులు వేలాదిగా వెంటరాగా, ఆలయం ఎదుట జ్వాలాతోరణాన్ని వెలిగించారు. జ్వాలాతోరణం విభూతిని వ్యాపారం నిర్వహించే దుకాణాలలోగానీ, ఇళ్ళలోగానీ ఉంచితే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతవని ఆలయ పురోహితులు తెలిపినారు. 

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి ఆలయం సవరించు
ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2017, మార్చి-13వతేదీ సోమవారంనాడు, ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, శాంతికళ్యాణం అనంతరం అన్నసమారాధన నిర్వహించెదరు. 14వతేదీ మంగళవారంనాడు నగరోత్సవం నిర్వహించెదరు. 

శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం...
ఈ ఆలయంలో 2016, ఫిబ్రవరి-18వ తేదీ గురువారంనాడు, స్వామివారికి ఎదురుగా పంచలోహ నందీశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గుడివాడ పట్టణానికి చెందిన శ్రీ రెడ్డి లోకేశ్వరరావు, భాగ్యవతి దంపతులు, ఈ విగ్రహాన్ని ఆలయానికి బహూకరించారు. 

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం...
స్థానిక బంటుమిల్లి రహదారిలోని ఈ ఆలయములో, ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి సందర్భంగా మూడురోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించెదరు. రెండవరోజున స్వామివారు చతుర్భుజ ఆంజనేయస్వామిగా దర్శనమిచ్చెదరు. మూడవరోజున హనుమజ్జయంతినాడు, స్వామివారు పంచముఖాంజనేయస్వామిగా దర్శనమిచ్చెదరు. ఈ మూడురోజులూ ఆలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించెదరు. 

శ్రీ శంకరమందిరం ...
ఈ మందిరం స్థానిక బంటుమిల్లి రహదారిలోని ఉంది.

శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం ...
ఈ ఆలయ 16వ వార్షికోత్సవాలు, 2015, మే నెల-9,10 తేదీలలో వైభవంగా నిర్వహించారు. రెండవరోజైన ఆదివారంనాడు, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. 

శ్రీ గౌరీశంకరస్వామివారి దేవస్థానం..
ఈ ఆలయం గుడివాడ పట్టణంలోని నాలుగవ వార్డులో ఉంది.

శ్రీ ఉమానాగలింగేశ్వరస్వామివారి ఆలయం...
ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2017, మార్చి-13వతేదీ సోమవారంనాడు, ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, శాంతికళ్యాణం అనంతరం అన్నసమారాధన నిర్వహించెదరు. 14వతేదీ మంగళవారంనాడు నగరోత్సవం నిర్వహించెదరు. 

శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం
ఈ ఆలయం స్థానిక నీలామహల్ రహదారిలో ఉంది.

మూడు ఉపాలయాల సముదాయం 
శ్రీ గౌరీశంకరస్వామివారి దేవస్థానానికి చెందిన స్థలంలో, కేవలం దాతల ఆర్థిక సహకారంతో, ఒక కోటిన్నర రూపాయల అంచనా వ్యయంతో, ఒకే ప్రాంగణంలో, నూతనంగా ఈ ఆలయాలు రూపుదిద్దుకున్నవి. ఈ ఆలయాలలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015, జూన్-4వ తేదీ గురువారంనాడు ప్రారంభించారు. 5వ తేదీ శుక్రవారంనాడు, భక్తులు సమస్త దేవతార్చన పూజలను వైభవంగా నిర్వహించారు. 7వ తెదీ ఆదివారంనాడు, మేళతాళాలు, వేదపండితుల మంరోచ్ఛారణల మధ్య, విగ్రహ, శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న శివాలయంలో స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేదపండితులు ఉదయం నుండి, ప్రత్యేకపూజలు నిర్వహించి, ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చి, స్వామివారిని దర్శించుకొని, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పెద్ద యెత్తున అన్నసమారాధన నిర్వహించారు. 

శ్రీ బాలకనకదుర్గాదేవి ఆలయం ..
శ్రీరాంపురంలోని ఈ ఆలయంలో శ్రీ మహాగణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీ బాలకనకదుర్గాదేవి వారల విగ్రహప్రతిష్ఠా మహోత్సవం, 2016, ఫిబ్రవరి-25వ తేదీ గురువారంనాడు ప్రారంభమైనవి. 26వ తేదీ శుక్రవారం ఉదయం 108 కలశాలతో అమ్మవారికి అభిషేకాలు, అమ్మవారి ప్రతిష్ఠా మహోత్సవం, పూర్ణాహుతి, శాంతికళ్యాణం మొదలగు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు.

శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ అనంత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం
ఈ ఆలయం బిళ్లపాడులో ఉంది
శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం 
శ్రీ బాలబావి గణపతి స్వామివారి ఆలయం 
ఈ ఆలయం స్థానిక 9వ వార్డులోని కఠారి రంగనాయకమ్మ వీధిలో ఉంది.

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం
స్థానిక పామర్రు రహదారిలోని ఈ ఆలయ 19వ వార్షికోత్సవంగా 2015, డిసెంబరు-24వ తేదీ గురువారంనాడు, ఆలయంలోని బాబాకు 108 కలశాలతో క్షీరాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం, సాయి నక్షత్రమాలిక పఠనం నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. 

భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమం 
ఈ ఆశ్రమం కార్మికనగర్ లో, రామాలయం వెనుకనున్నది. ఈ ఆశ్రమంలో స్వామివారి 33వ ఆరాధనోత్సవాలు, 2015, ఆగష్టు-23,24తేదీలలో వైభవంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.

ఈ అశ్రమ మందిర నిర్మాణంలో భాగంగా, దాతల ఆర్థిక సహకారంతో నిర్మించనున్న గోపుర నిర్మాణానికి, 2015, నవంబరు-21వ తేదీ శనివారంనాడు, శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 2016, ఫిబ్రవరిలో నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు. శ్రీ జల్లా సుబ్బారావు, ఈ గోపుర నిర్మాణ శిల్పి. 

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం..
స్వామివారి 45వ ఆరాధనామహోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ ఆలయంలో 2016, మే-7వ తేదీ శనివారంనాడు, ఆలయంలో ఉత్సవాలను ప్రారంభించారు.

ప్రణవాశ్రమం 
శ్రీ పార్శ్వనాథస్వామివారి ఆలయం ..
గుడివాడ పట్టణంలోని మార్వాడి గుడి రహదారిపై ఉన్న ఈ ఆలయంలో, పర్వాపజుషన్ పర్వదినాన్ని పురస్కరించుకొని, మార్వాడీలు, 2017, ఆగష్టు-19 నుండి 27 వరకు ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఈ 9 రోజులూ ఉపవాస దీక్షలు పాటించారు. 9వ రోజూ మరియూ ఆఖరి రోజైన 27వతేదీ ఆదివారంనాడు, 18 రకాల పూజా సామాగ్రితో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. 

శాసనసభ నియోజకవర్గం...
 గుడివాడ శాసనసభ నియోజకవర్గ ము ఉన్నది.
 


No comments:

Post a Comment

గుడివాడ చరిత