Thursday, October 22, 2020

గుడివాడ, 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన పట్టణం.
పిన్ కోడ్ నం. 521 301.,
 ఎస్.టి.డి.కోడ్ = 08674.

గుడివాడ పట్టణ చరిత్ర ....
ఒకప్పుడు కళింగ రాజు పరిపాలనలో 'గుడివాడ' ఆంధ్రనగరం పేరుతో ప్రసిద్ధి చెందింది. రాజ్య విస్తరణలో భాగంగా అశోకుడు, కళింగ రాజు పై దండెత్తి ఓడించాడు. అప్పటి వరకు కళింగ రాజు పాలనలో వున్నా ఆంధ్ర ప్రజలు, యుద్ధంలో గెలిచిన అశోక చక్రవర్తిని రాజుగా అంగీకరించారు. క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బై మూడు నాటికి అశోకుడు పరిపాలించే కాలంలో ఆంధ్ర నగరాలు మూడు పదులు వున్నై. కృష్ణాతీరంలో అశోకుని కాలానికి ఎన్నో బౌద్ధ కేంద్రాలు ప్రసిద్ధి చెందాయి. ఆ కాలంలో కృష్ణా నదికి ఇరువైపులా వున్నా పరచిన గ్రామాలన్నీ బౌద్ధ క్షేత్రాలే.

అమరావతి, భట్టిప్రోలు, నాగార్జునకొండ, జగ్గయ్య పేట, బోడపాడు, చందోలుతో 'గుడివాడ ' కూడా బౌద్ధ కేంద్రాలుగా గుర్తింపబడ్డాయి. కృష్ణా నది తీరంలో బౌద్ధ స్థూపాలను నిర్మించటానికి, బౌద్ధ మతం ప్రచారం పొందటానికి అశోకుడే కారణం. బుద్ధుని అస్తికలను నిక్షిప్తం చేసి, మహా చైత్యాలుగా మార్చాడు. చైత్యం అంటే 'చితి' కి సంబంధించిన ఎముకలని నిక్షిప్తం చేసిన స్తూపం. 1984 లో 'రీ' అనే పరిశోధకుడు, దాక్షిణాత్య బౌద్ధ శిల్పాలు - భట్టిప్రోలు, ఘంటసాల, గుడివాడ పురాతన స్తూపాలు' అన్న నివేదిక సమర్పించాడని, ఆ నివేదికను పుణీలో నార్ల వారు చదివానని చెప్పగా తెలిసింది. అందులో గుడివాడ 'దీపాల దిబ్బ' లో దొరికిన విదేశీ నాణాలు, బౌద్ధ క్షేత్ర ప్రాచీనతని తెలియ చేస్తోంది.

గుడివాడ పేరు వెనుక చరిత్ర 
కలువ పూలతో నిండి ఉన్న ఒక కొలను
గుడివాడని పూర్వం గుళ్ళవాడ అనేవారు. అది కాలక్రమేన గుడివాడగా మారింది. ఈ పట్టణములో చాలా గుడులు ఉన్నాయి.

గుడివాడ పట్టణ భౌగోళికం సవరించు
సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప పట్టణాలు
గుడివాడ, 
హనుమాన్ జంక్షన్,
 పెడన, 
ఏలూరు

సమీప మండలాలు 
నందివాడ, పెదపారుపూడి, గుడ్లవల్లేరు, పామర్రు.ముడినేపల్లి.

రవాణా సౌకర్యాలు...
గుడివాడ పట్టణము నుండి దగ్గర, దూర అన్నిప్రాంతముల వైపులకు బస్సు, రైలు తదితర రవాణా సౌకర్యములు ఉన్నాయి.
గుడివాడ ప్రాంతము నుండి భీమవరం, రాజొలు, నర్సాపురం, విశాఖపట్నం, బెజవాడ, తిరుపతి, బెంగులురు, హైదరాబాదు, మచిలీపట్నం రైల్వే, బస్ వసతులు ఉన్నాయి.
ఈ పట్టణము నుండి దాదాపుగా 30-35 కి.మీ. దగ్గరలో గన్నవరం విమానాశ్రయము ఉంది.
రైలు వసతి 
గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ లో నిలిచి, బయలు దేరుటకు సిద్దముగా ఉన్న సికింద్రాబాద్ - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్
గుడివాడ రైల్వే జంక్షన్.
గుడివాడ - విజయవాడ - భీమవరం - నరసాపురం - మచిలీపట్నం రైల్వే ట్రాక్ డబుల్, విధుయుతీకరణ లేక పోవటం ప్రధాన సమస్య.
గుడివాడ ప్రాంతం నుండి తిరుపతి, విశాఖపట్నం, ముంబై, షిరిడి, పురి, భిలాసాపూర్, భువనేశ్వర్, విజయవాడ, హైదరాబాదు రైళ్లు ఉన్నాయి.
గుడివాడ - విజయవాడ - భీమవరం - నరసాపురం - మచిలీపట్నం రైల్వే ట్రాక్ డబుల్ ట్రాక్ పనులు మొదలపెట్టేరు
సాధారణ బండ్లు 
గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషనులో నిలిచి ఉన్న ఒక ప్యాసింజర్ రైలు.
విజయవాడ - గుడివాడ ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77213
విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77215
విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77206
గుంటూరు - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57381
విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77212
గుడివాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77219
విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77207
విజయవాడ - గుడివాడ ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77201
విశాఖపట్నం - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57230
రైళ్లు వివరములు :
17049 - మచిలీపట్నం నుండి సికందరాబాద్.
17255 - నరసాపురం నుండి హైదరాబాదు.
17213 | 17231 - నరసాపురం నుండి నాగర్సొల్.
17210 - కాకినాడ నుండి బెంగళూరు.
17644 - కాకినాడ నుండి చెన్నపట్నం.
18519 - విశాఖపట్నం నుండి ముంబాయి.
17015 - విశాఖపట్నం నుండి హైదరాబాదు.
17404 - నరసాపురం నుండి తిరుపతి.
17479 - పూరి నుండి తిరుపతి.
17481 - భిళాస్పుర్ నుండి తిరుపతి.
గుడివాడ, వెంట్రప్రగడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. ఇదిరిఅల్వెజంక్షన్ విజయవాడ రైల్వేస్టేషన్: 44 కి.మీ

గుడివాడ పట్టణంలోని విద్యా సౌకర్యాలు 
గుడివాడ పట్టణంలోని మౌలిక సదుపాయాలు 
గుడివాడ పట్టణ పరిపాలన 
గుడివాడ పట్టణములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు సవరించు
శ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయం సవరించు
శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం సవరించు
ఇక్కడ ఉన్న శ్రీ వెంకటేశ్వర వారి ఈ దేవాలయము ప్రసిద్ధి కల దేవాలయము. ఇక్కడ స్వామి వారి కల్యాణము ఒక పేద్ద మహొత్సవంలా జరుగుతాయి. ఈ ఆలయంలో, 2014, నవంబరు-3, సోమవారం నుండి, 6వ తేదీ గురువారం వరకు, స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, 6వ తేదీ గురువారం నాడు, స్వామివారికి స్నపనం, విశేష అలంకరణ, వేదవిన్నపం, చతుస్థానార్చన, సర్వ ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించారు. ద్వారతోరణబలి, మహా పూర్ణాహుతి, పవిత్ర అవరోహణం, అనంతరం 108 కలశాలతో క్షీరాభిషేకం నిర్వహించారు. మన గుడి కార్యక్రమం క్రింద తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం అన్నదానసత్రంలో కార్తీక వనసమారాధన నిర్వహించారు.
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, జ్యేష్ఠమాసంలో, శుద్ధ దశమి నుండి పౌర్ణమి వరకు వైభవంగా నిర్వహించెదరు. 
శ్రీ నాగమ్మ తల్లి దేవాలయము సవరించు
సింగరెపాలెం నాగమ్మ తల్లి దేవాలయము బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయము. ఇక్కడకి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న నాగమ్మ తల్లి బాగా మహిమ కల దేవతగా ఇక్కడ ఉన్న ప్రజలు కొలుస్తారు.

శ్రీ ఉమానాగలింగేశ్వరస్వామివారి ఆలయం సవరించు
ఈ ఆలయంలో 2014, నవంబరు-6వ తేదీ రాత్రి, కార్తీకపౌర్ణమి సందర్భంగా, నాలుగున్నర కోట్ల దీపాలతో దీపోత్సవాన్ని నిర్వహించారు. పురవీధులలో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. భక్తులు వేలాదిగా వెంటరాగా, ఆలయం ఎదుట జ్వాలాతోరణాన్ని వెలిగించారు. జ్వాలాతోరణం విభూతిని వ్యాపారం నిర్వహించే దుకాణాలలోగానీ, ఇళ్ళలోగానీ ఉంచితే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతవని ఆలయ పురోహితులు తెలిపినారు. 

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి ఆలయం సవరించు
ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2017, మార్చి-13వతేదీ సోమవారంనాడు, ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, శాంతికళ్యాణం అనంతరం అన్నసమారాధన నిర్వహించెదరు. 14వతేదీ మంగళవారంనాడు నగరోత్సవం నిర్వహించెదరు. 

శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం...
ఈ ఆలయంలో 2016, ఫిబ్రవరి-18వ తేదీ గురువారంనాడు, స్వామివారికి ఎదురుగా పంచలోహ నందీశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గుడివాడ పట్టణానికి చెందిన శ్రీ రెడ్డి లోకేశ్వరరావు, భాగ్యవతి దంపతులు, ఈ విగ్రహాన్ని ఆలయానికి బహూకరించారు. 

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం...
స్థానిక బంటుమిల్లి రహదారిలోని ఈ ఆలయములో, ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి సందర్భంగా మూడురోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించెదరు. రెండవరోజున స్వామివారు చతుర్భుజ ఆంజనేయస్వామిగా దర్శనమిచ్చెదరు. మూడవరోజున హనుమజ్జయంతినాడు, స్వామివారు పంచముఖాంజనేయస్వామిగా దర్శనమిచ్చెదరు. ఈ మూడురోజులూ ఆలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించెదరు. 

శ్రీ శంకరమందిరం ...
ఈ మందిరం స్థానిక బంటుమిల్లి రహదారిలోని ఉంది.

శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం ...
ఈ ఆలయ 16వ వార్షికోత్సవాలు, 2015, మే నెల-9,10 తేదీలలో వైభవంగా నిర్వహించారు. రెండవరోజైన ఆదివారంనాడు, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. 

శ్రీ గౌరీశంకరస్వామివారి దేవస్థానం..
ఈ ఆలయం గుడివాడ పట్టణంలోని నాలుగవ వార్డులో ఉంది.

శ్రీ ఉమానాగలింగేశ్వరస్వామివారి ఆలయం...
ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2017, మార్చి-13వతేదీ సోమవారంనాడు, ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, శాంతికళ్యాణం అనంతరం అన్నసమారాధన నిర్వహించెదరు. 14వతేదీ మంగళవారంనాడు నగరోత్సవం నిర్వహించెదరు. 

శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం
ఈ ఆలయం స్థానిక నీలామహల్ రహదారిలో ఉంది.

మూడు ఉపాలయాల సముదాయం 
శ్రీ గౌరీశంకరస్వామివారి దేవస్థానానికి చెందిన స్థలంలో, కేవలం దాతల ఆర్థిక సహకారంతో, ఒక కోటిన్నర రూపాయల అంచనా వ్యయంతో, ఒకే ప్రాంగణంలో, నూతనంగా ఈ ఆలయాలు రూపుదిద్దుకున్నవి. ఈ ఆలయాలలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015, జూన్-4వ తేదీ గురువారంనాడు ప్రారంభించారు. 5వ తేదీ శుక్రవారంనాడు, భక్తులు సమస్త దేవతార్చన పూజలను వైభవంగా నిర్వహించారు. 7వ తెదీ ఆదివారంనాడు, మేళతాళాలు, వేదపండితుల మంరోచ్ఛారణల మధ్య, విగ్రహ, శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న శివాలయంలో స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేదపండితులు ఉదయం నుండి, ప్రత్యేకపూజలు నిర్వహించి, ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చి, స్వామివారిని దర్శించుకొని, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పెద్ద యెత్తున అన్నసమారాధన నిర్వహించారు. 

శ్రీ బాలకనకదుర్గాదేవి ఆలయం ..
శ్రీరాంపురంలోని ఈ ఆలయంలో శ్రీ మహాగణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీ బాలకనకదుర్గాదేవి వారల విగ్రహప్రతిష్ఠా మహోత్సవం, 2016, ఫిబ్రవరి-25వ తేదీ గురువారంనాడు ప్రారంభమైనవి. 26వ తేదీ శుక్రవారం ఉదయం 108 కలశాలతో అమ్మవారికి అభిషేకాలు, అమ్మవారి ప్రతిష్ఠా మహోత్సవం, పూర్ణాహుతి, శాంతికళ్యాణం మొదలగు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు.

శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ అనంత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం
ఈ ఆలయం బిళ్లపాడులో ఉంది
శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం 
శ్రీ బాలబావి గణపతి స్వామివారి ఆలయం 
ఈ ఆలయం స్థానిక 9వ వార్డులోని కఠారి రంగనాయకమ్మ వీధిలో ఉంది.

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం
స్థానిక పామర్రు రహదారిలోని ఈ ఆలయ 19వ వార్షికోత్సవంగా 2015, డిసెంబరు-24వ తేదీ గురువారంనాడు, ఆలయంలోని బాబాకు 108 కలశాలతో క్షీరాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం, సాయి నక్షత్రమాలిక పఠనం నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. 

భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమం 
ఈ ఆశ్రమం కార్మికనగర్ లో, రామాలయం వెనుకనున్నది. ఈ ఆశ్రమంలో స్వామివారి 33వ ఆరాధనోత్సవాలు, 2015, ఆగష్టు-23,24తేదీలలో వైభవంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.

ఈ అశ్రమ మందిర నిర్మాణంలో భాగంగా, దాతల ఆర్థిక సహకారంతో నిర్మించనున్న గోపుర నిర్మాణానికి, 2015, నవంబరు-21వ తేదీ శనివారంనాడు, శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 2016, ఫిబ్రవరిలో నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు. శ్రీ జల్లా సుబ్బారావు, ఈ గోపుర నిర్మాణ శిల్పి. 

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం..
స్వామివారి 45వ ఆరాధనామహోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ ఆలయంలో 2016, మే-7వ తేదీ శనివారంనాడు, ఆలయంలో ఉత్సవాలను ప్రారంభించారు.

ప్రణవాశ్రమం 
శ్రీ పార్శ్వనాథస్వామివారి ఆలయం ..
గుడివాడ పట్టణంలోని మార్వాడి గుడి రహదారిపై ఉన్న ఈ ఆలయంలో, పర్వాపజుషన్ పర్వదినాన్ని పురస్కరించుకొని, మార్వాడీలు, 2017, ఆగష్టు-19 నుండి 27 వరకు ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఈ 9 రోజులూ ఉపవాస దీక్షలు పాటించారు. 9వ రోజూ మరియూ ఆఖరి రోజైన 27వతేదీ ఆదివారంనాడు, 18 రకాల పూజా సామాగ్రితో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. 

శాసనసభ నియోజకవర్గం...
 గుడివాడ శాసనసభ నియోజకవర్గ ము ఉన్నది.
 


శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు

అట్లూరి పూర్ణచంద్రరావు
సినీ నిర్మాత, కమ్యూనిస్టు నాయులు.
జీవిత విశేషాలు
 వీరు కృష్ణాజిల్లా, గుడివాడ మండలం, చౌటుపల్లి గ్రామంలో 1925వ సంవత్సరం ఏప్రిల్ 4న జన్మించారు.. వీరికి చదువు పెద్దగా అబ్బలేదు. ఎస్.ఎస్.సి ఫెయిల్ అయిన తర్వాత ఇంటి నుండి పారిపోయి విజయవాడలో ఒక కాంట్రాక్టర్ వద్ద మూడు నెలలు పనిచేశారు. తర్వాత గుడివాడలోని గౌరీశంకర్ టాకీసులో ప్రొజెక్టర్ ఆపరేటింగ్ అసస్టెంట్‌గా, బుకింగ్ క్లర్క్‌గా ఆరు నెలలు పనిచేశారు.. తర్వాత విజయవాడలోని నవయుగ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీలో ఐదు సంవత్సరాలు పనిచేశారు.. అదే సంస్థ గుంతకల్లు బ్రాంచి మేనేజరుగా కొంతకాలం పనిచేశారు. తర్వాత మద్రాసుకు వెళ్లి బి.విఠలాచార్య, పి.పుల్లయ్యల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు.. తర్వాత మిత్రుల సలహాతో ప్రొడక్షన్ రంగంలోకి ప్రవేశించారు. సినిమాలలో ప్రొడక్షన్ అసిస్టెంటుగా నాలుగు సంవత్సరాలు పనిచేసి మెళకువలు నేర్చుకున్నారు..

సినీ నిర్మాణ రంగంలో 
వీరు 1964లో మొట్టమొదటగా అగ్గిమీద గుగ్గిలం చిత్రాన్ని ప్రారంభించారు. నవభారత్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎస్.ప్రకాశరావు 50వేలు పెట్టుబడి పెట్టారు. ఈ చిత్రం ప్రారంభం నుండి చివరివరకు పూర్ణచంద్రరావు చూసుకున్నా నిర్మాతగా వీరి పేరు మొదటి ఐదు సినిమాలలో వేసుకోలేదు. ఇతడు తెలుగులో 35 సినిమాలు, హిందీలో 18 సినిమాలు, తమిళంలో 13 సినిమాలు, కన్నడ, బెంగాలీ, ఒరియా, మరాఠీ భాషలలో రెండేసి చిత్రాలు, భోజ్‌పురిలో ఒక చిత్రం నిర్మించారు.

శరత్ బాబును సినీ నటుడిగా పరిచయం చేశారు. రాచకొండ విశ్వనాథ శాస్త్రిని సినీ సంభాషణల రచయితగా వెండితెరకు పరిచయం చేశారు.

సినిమాల జాబితా  ..
అగ్గిమీద గుగ్గిలం
అపాయంలో ఉపాయం
ఉక్కుపిడుగు
గజదొంగ గంగన్న
మాతృదేవత
రైతు కుటుంబం
రౌడీరాణి
పాపం పసివాడు
ప్రేమ పుస్తకం
వెంకీ
లోక్ పరలోక్ (హిందీ)
మాంగ్ భరో సజనా (హిందీ)
ఏక్ హీ భూల్ (హిందీ)
అంధాకానూన్ (హిందీ)
ఆఖరీరాస్తా (హిందీ)
చాల్‌భాజ్ (హిందీ)
దిల్ (తమిళ)
యూత్ (తమిళ)
ఇడియట్ (హిందీ)

కొంతకాలం కాలేయ క్యాన్సర్ తో బాధపడుతూ 2017, అక్టోబరు 29 న హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. వీరి  భార్య పేరు మరుద్వతి. వీరికి ఇరువురు కుమారులు ఉన్నారు.

శ్రీ కామినేని ఈశ్వరరావు...

 అర్జున అవార్డ్ గ్రహీత.. వైట్ లిఫ్టర్ కామినేని ఈశ్వరరావు...
 జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో, కృష్ణా జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకొని వెళ్ళిన ఘనత, అర్జున అవార్డు గ్రహీత శ్రీ కామినేని ఈశ్వరరావు గారికే దక్కుతుంది. భారతదేశంలోని అనేక నగరాలలో, భారత వెట్ లిఫ్టింగ్ ఫెడెరేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో 9 పసిడి పతకాలూ, భారతదేశంలో 12 జాతీయ రికార్డులను సాధించిన మొదటి భారతీయుడు శ్రీ ఈశ్వరరావు కావటం విశేషం...
వీరు గుడివాడ దగ్గర భట్ల పెనుమర్రు... గ్రామంలో 1926, ఆగస్టు-28వ తేదీన ఒక రైతు కుటుంబంలో జన్మించారు. వెయిట్ లిఫ్టింగ్ లో గోసాలలోని గురువు శ్రీ రంగదాసుగారి వద్ద, శిక్షణ పొందినారు. జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో కోల్ కతా, చెన్నై, ముంబై, కొత్త డిల్లీ, జబల్ పూర్ మొదలగు నగరాలతో పాటు, విదేశాలలోని హెల్సింకీ (ఫిన్లెండు), వార్సా (పోలెండ్), మెల్బోర్న్ (ఆస్ట్రేలియా), జకార్తా (ఇండోనేషియా) మొదలగు చోట్ల జరిగిన పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచారు. 1951లో కోల్ కతాలో జరిగిన అన్ని విభాగాలలోనూ, శరీర సౌష్టవ పోటీలలోనూ, పసిడి పతకాలు సాధించారు. 1963లో అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా "అర్జున" అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా నిలిచారు.
ఎన్నో రికార్డులు:- 1951లో ఆసియా క్రీడలలో, ఇంతవరకూ ఏ భారతీయుడూ సాధించని రజత పతకాన్ని ఈయన వెయిట్ లిఫ్టింగులో సాధించారు. దేశంలో 12 జాతీయ రికార్డులు, ఆసియా ఖండంలో 4 రికార్డులు స్థాపించిన తొలి భారతీయుడు. ఈయన కృష్ణా జిల్లా క్రీడా సంఘానికి కార్యదర్శిగా పనిచేశినారు. వీరికి చలనచిత్ర రంగంలో గూడా ప్రవేశం ఉంది. "భీమాంజనేయ యుద్ధం" అను చిత్రంలో వీరి ప్రత్యర్థి శ్రీ దండమూడి రాజగోపాలరావుతో పోటీగా ఆంజనేయ పాత్ర ధరించి పలువురు ప్రశంసలు పొందినారు. వీరు 1977, నవంబరు-7న గుండెపోటుతో కన్నుమూశారు.
కుటుంబ నేపథ్యం:- వీరి ఇద్దరు సంతానం. కుమారుడు డాక్టర్ కె.పిరావు, హాంగ్ కాంగ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. కుమార్తె శ్రీమతి వసుంధర, విజయవాడలో గృహిణిగా ఉన్నారు.
యోధానుయోధులు:- గతంలో ఆంధ్రప్రదేశ్ లో, వెయిట్ లిఫ్టింగ్ అంటే కృష్ణాజిల్లా నే గుర్తుకు వచ్చేది. జిల్లాకు చెందిన శ్రీ కామినేని ఈశ్వరరావు, శ్రీ దండమూడి రాజగోపాలరావు వంటి యోధానుయోధులు, జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకొని వచ్చారు. వీరితోపాటు బొబ్బా వెంకటేశ్వరరావు, ఎం.పి.రంగా, మాదు వెంకటేశ్వరరావు, సంపత్, రామస్వామి, అచ్యుతరావు వంటి ఎందరో వెయిట్ లిఫ్టర్లు 1945-70 మధ్య జిల్లాకు మంచిపేరు తీసుకొని వచ్చారు.

శ్రీ పామర్తి సుబ్బారావు


శ్రీ పామర్తి సుబ్బారావు గారు (సెప్టెంబర్ 8, 1922 - జనవరి 28, 2004)  గుడివాడ..
నాటి ప్రముఖ రంగస్థల నటులు దర్శకులు, క్రీడాకారులు.

సుబ్బారావుగారు 1922, సెప్టెంబర్ 8న శ్రీరాములు, మాణిక్యాంబ దంపతులకు గుడివాడలో జన్మించారు

రంగస్థల ప్రస్థానం 
చిన్నప్పటి నుంచి నాటక ప్రదర్శనల పట్ల ఆసక్తివున్న సుబ్బారావు గారు తన సహచరులైన సూరపనేని ప్రభాకరరావు, హెచ్.వి. చలపతిరావు, దాసరి తిలకం, పువ్వుల అనసూయ మొదలైన వారితో కలిసి నాటకాలు వేయడం ప్రారంభించారు..నట సామ్రాట్ అక్కినేని సహాధ్యాయి...మిత్రులు..
 తన బృందంతో 'తెలుగుతల్లి' నాటకాన్ని విస్తృతంగా ప్రదర్శించారు. 1939లో తెలుగుతల్లి నాటకాన్ని విజయవాడలో ప్రదర్శించినప్పడు తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి ముగ్ధులై పామర్తికి 'హాస్యరత్న' బిరుదు ప్రదానం చేసి ఆశీర్వదించారు. ‘పల్లెపడుచు'లో గంగులు పాత్ర 'సుల్తానీ'లో పరమానందం, 'ఎవరు దొంగ'లో దొంగ వంటి పాత్రలే పోషించారు.

బొబ్బిలియుద్ధం, సత్యహరిశ్చంద్రీయం, మహాకవి కాళిదాసు, చంద్రగుప్త, రంగూన్ రౌడీ మొదలైన పద్య నాటకాలను ప్రదర్శించారు. శ్రీ ప్రభాకర నాట్యమండలి సంస్థ పేర అనేక ప్రదర్శనలు ఇచ్చారు. పినిశెట్టి శ్రీరామమూర్తి రచించిన 'పల్లెపడుచు' నాటకంలో గంగులు పాత్ర అద్భుతంగా పోషించేవారు. 1951లో తెనాలిలో జరిగిన పోటీలలో ఆత్రేయ రచించిన ఎవరు దొంగ నాటికను ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శనకు, నటనకు బహుమతులందుకున్నారు. ప్రముఖ కళాకారులైన కైకాల సత్యనారాయణ, పుష్పకుమారి, రేడియో ఏకాంబరం, జాలాది రాజారావు, జి.వి. ప్రసాదరావు, నిర్మలమ్మ, హేమలత, అమ్ముల పార్వతి మొదలైనవారు పామర్తి శిక్షణలో నటనను నేర్చుకున్నారు. పామర్తి దర్శకత్వం వహించిన ఆరు స్త్రీ పాత్రలున్న 'చావకూడదు' నాటిక ఆంధ్ర నాటక కళాపరిషత్తు నాటక పోటీలో ఉత్తమ నటి, ద్వితీయ ఉత్తమ ప్రదర్శన బహుమతులను అందుకుంది.

వేలూరి శివరామ శాస్త్రి రచించిన రేడియో నాటికను ప్రదర్శనకు అనుగుణంగా రాసి, అందులో పరమానందం పాత్రలో నటించాడు. 1961లో నాటక కళాపరిషత్తులో 'సుల్తానీ' నాటికను మనోజ్ఞంగా ప్రదర్శించడం, దానికి ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకత్వం బహుమతులు గెలుచుకోవడం జరిగింది. సుల్తానీ పామర్తి నట జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది.

సన్మానాలు – పురస్కారాలు సవరించు
1991లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంల 'గౌరవ పురస్కారం'
1993లో అక్కినేని కళాపీఠం పురస్కారం
1994లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు పురస్కారం
1997లో అంబేద్కర్ జీవన సాఫల్య పురస్కారం
1997లో కళాజగతి రంగస్థల పురస్కారం
1999లో శ్రీకళానికేతన్ (హైదరాబాద్) జూలూరి వీరేశలింగం కల్చరల్ అవార్డు
గుర్తింపులు సవరించు
గుడివాడలో సుబ్బారావు కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించండమేకాకుండా, పామర్తి నివసించిన వీధికి 'పామర్తి సుబ్బారావుగారి వీధి' అని నామకరణం చేశారు.
సుబ్బారావు 2004, జనవరి 28న దివంగతులయ్యారు..

శ్రీ. వీ.యస్.ఆర్. స్వామి

శ్రీ  వి.ఆర్. స్వామి ప్రముఖ కెమెరామెన్
 100 సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు.
కృష్ణా జిల్లా, గుడివాడ మండలం, వలివర్తిపాడు గ్రామంలో జూలై 15 1935 న జన్మించారు. ఈయనకు చిన్నప్పటి నుండి ఫోటోగ్రఫీపైన మక్కువ ఎక్కువ.ఈయన తన గురువైన సి.నాగేశ్వరరావు వద్ద ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు అయిన రవికాంత్ మెగా, ఎస్.శంకర్ ల దగ్గర పనిచేశారు. వీరాభిమన్యు, బందిపోటు చిత్రాలకు కెమెరా ఆపరేటర్‌గా పనిచేశారు. కృష్ణ నటించిన అసాధ్యుడు చిత్రంతో మొదటి సారిగా ఇతడు ఛాయాగ్రాహకుడయ్యారు. ఈయన సినిమాటోగ్రఫీలో ఎన్నో ప్రయోగాలు చేశారు. తెలుగులో అగ్రనటుల చిత్రాలకు ఎక్కువగా ఛాయాగ్రాహకుడిగా పనిచేసింది ఈయనే. 1986లో నిర్మింపబడిన తొలి తెలుగు 70 ఎం.ఎం. సినిమా సింహాసనంకు ఈయనే ఛాయాగ్రాహకుడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు ఎం.వి.రఘు, ఎస్. గోపాలరెడ్డి, రాం ప్రసాద్ లు ఇతని శిష్యులే.

వెండితెరపై అద్భుతాలు సవరించు
మోసగాళ్ళకు మోసగాడు సినిమా క్లైమాక్స్ తీస్తున్నారు. హీరో కృష్ణ, విలన్ని గట్టిగా గూబమీద కొట్టాలి. ఆ దెబ్బకి అతనికి లోకమంతా గిర్రున తిరిగే ఎఫెక్టు రావాలి. ఈ నన్నివేశం ఎలా తీయాలి?. అందరూ టెన్షన్ పడుతున్నారు గానీ, కెమెరామన్ మాత్రం తాపీగా ఆలోచిసూ కూర్చున్నారు. కాసేపటి తర్వాత లారీ టైర్ తెమ్మని పురమాయించారు. దాన్ని తాడుతో వేలాడదీశారు. "ఈ లారీటైర్తో ఈయనగారు ఏం చేస్తారా" అని యూనిట్ అంతా వళ్లంతా కళ్ళు చేసు కుని మరీ చూస్తుంటే, ఆ కెమెరామన్ తన కెమెరాతో సహా ఆ లారీటైర్లో కూర్చుని దాన్ని గిర్రున తిప్పమని ఆదేశించారు. అలా టైర్లో గిర్రున తిరుగుతూ ఆ సీన్ షూట్ చేశారు. ఆ కాలంలో యిప్పటిలా క్రేనులూ, గ్రాఫిక్సూ లేనప్పటికీ కేవలం తన బుర్రతోనే కెమెరా కు పని చెప్పి వెండితెరపై వండర్స్ చేశారు. ఆయన ఛాయాగ్రహణ శాఖలో పూనా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి వచ్చిన తొలి బృందంలో ఒకరు. రవికాంత్ నగాయిచ్ లాంటి మహామహుల దగ్గర శిష్య రికం చేసిన స్వామి అసాధ్యుడు(1985)తో కెమెరామన్ గా మారారు తెలుగు సినిమాని సాంకేతికంగా కీలక మైన మలుపు తిప్పిన ఆయన. కలర్, సినిమా స్కోప్, 70 ఎం.ఎం. వంటి ప్రక్రియల్లో తొలినాళ్లలోనే ప్రయో గాలకు శ్రీకారం చుట్టారు. 250 పైగా సినిమాలకు ఛాయాగ్రహణం సమకూర్చారు. మలయాళం మినహా దాదాపు అన్ని భాషల్లోనూ చక్రం (కెమెరా) తిప్పారు. ఆయన ఖాతాలో ఎన్నో విలువైన చిత్రాలు ఉన్నాయి.

హిందీలో 'మహాశక్తిమాన్' అనే త్రీడీ చిత్రం, తెలుగులో ఆపద్బాంధవులు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే ఎదురీత, కలియుగ స్త్రీ అనే సినిమాలను నిర్మించారు. నేటి ప్రసిద్ధ ఛాయాగ్రాహకులు ఎస్.గోపాల్రెడ్డి, ఎమ్వీ రఘు, శరత్, తదితరులు ఈయన దగ్గర శిష్యరికం చేసిన వారే. కెమెరామన్ గా ఆయన చివరి చిత్రం ప్రభాస్ నటించిన 'అడవి రాముడు.
ఛాయాగ్రాహకుడిగా
====తెలుగు====
అసాధ్యుడు (1968)
కథానాయకుడు (1969)
మోసగాళ్ళకు మోసగాడు (1971)
భలే మోసగాడు (1972)
అందాల రాముడు (1973)
దేవుడు చేసిన మనుషులు (1973)
మంచివాళ్లకు మంచివాడు (1973)
అల్లూరి సీతారామరాజు (1974)
భక్త కన్నప్ప (1976)
సిరిసిరిమువ్వ (1976)
ఎదురీత (1977)
విచిత్ర జీవితం (1978)
యువరాజు (1982)
ఖైదీ (1983)
చట్టంతో పోరాటం (1985)
వేట (1986)
సింహాసనం (1986)
ఆదిత్య 369 (1991)
చినరాయుడు (1992)
ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)
రౌడీ ఇన్‌స్పెక్టర్ (1992)
సమరసింహారెడ్డి (1999)
నరసింహ నాయుడు (2001)
భలేవాడివి బాసు (2001)
ఇంద్ర (2002)
కొండవీటి సింహాసనం (2002)
అనగనగా ఓ కుర్రాడు (2003)
అడవి రాముడు (2004)
లక్ష్మీనరసింహా (2004)
విజయేంద్ర వర్మ (2004)
ఒక్క మగాడు (2008)
హిందీ
ఇత్నీ సీ బాత్ (1981)
పాతాళ్ భైరవి (1985)
సింఘాసన్ (1986)
దోస్త్ (1989)
దర్శకుడిగా 
మహా శక్తిమాన్ (1985)
పురస్కారాలు 
1987లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా విశ్వనాధ నాయకుడు చిత్రానికి తామ్ర నంది పురస్కారం.
నాలుగు దశాబ్దాల పాటు ఛాయాగ్రాహకుడిగా సుదీర్ఘ ప్రయాణం చేసి, ఎన్నో అజరామరమైన చిత్రాలకు తన కెమెరాతో నగిషీలద్దిన మేటి కెమెరామన్ వీయస్ఆర్ స్వామి 2008,నవంబరు 11న మచిలీపట్నంలో గుండెపోటుతో మరణించారు. మరణించే సమయానికి వీరి వయసు 73 సంవత్సరాలు.

శ్రీ ఎస్. వి.రామారావు గారు

శ్రీ.ఎస్. వి.రామారావు గారు (సిరందాసు వెంకట )  
భారత సంతతికి చెందిన బ్రిటిష్ చిత్రకారుడు. ఆయన క్యూబిస్ట్ చిత్రకళలో ప్రావీణ్యుడు.ఆయన 1962లో కామన్వెల్త్ ఫెలోషిప్ పొందాడు. భారత ప్రభుత్వం ఆయనకు దేశంలోని నాల్గవ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ తో గౌరవించింది..
ఆయన తండ్రి చెక్కతో శిల్పాలు చేసేవాడు. తరువాత ఆయన నిర్మాణ పని చేసేవాడు.రావు గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్టం లోని కృష్ణా జిల్లా గుడివాడ లో 1936లో జన్మించారు. ఆయన అకౌంటింగ్, బ్యాంకిగ్ లలో 1955లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పట్టాను పొందారు. ఆ కాలంలో కె.వేణుగోపాల్ వద్ద శిక్షణ పొందాడుతరువాత కె.శ్రీనివాసులు గారి వద్ద శిక్షణ పొంది 1955లో ఫైన్ ఆర్ట్స్ నందు ప్రభుత్వ డిప్లొమాను చెన్నైలోని కళాక్షేత్రం నుండి పొందాడు
 తరువాత శిక్షణ కోసం ఆయన మద్రాసు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ (ప్రస్తుతం ప్రభుత్వం కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్,చిన్నై) చేరాడు. 1959లో ఆయన ఫైన్ ఆర్ట్స్ డిగ్రీని పొందాడుఅదే విధంగా ఆయన ఎకనమిక్స్ ను అభ్యసించి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని పొందాడు.

ఆయన చెన్నైలో ప్రసిద్ధ చిత్రకారుడు అయిన కె.సి.ఎస్.పణికేర్ తో కలసి పనిచేసాడు. ఆయన 1959లో న్యూఢిల్లీ వెళ్ళాడు. అచట భారత ప్రభుత్వ రీసెర్చ్ ఫెలోషిప్ పొంది 1962 వరకు అక్కడ ఉన్నాడు ఆ సంవత్సరం ఆయన కామన్వెల్త్ ఫెలోషిప్ పొందాడు తరువాత ఆయాన్ యునైటెడ్ కింగ్ డం కు వెళ్ళి  అచట స్లాడ్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, యూనివర్శిటీ ఆఫ్ లండన్ లలో 1965 వరకు విలియం కోల్డ్‌స్ట్రీమ్‌ అద్వర్యంలో చదివాడు. తరువాత రెండు సంవత్సరాలు ఆయన లండన్ కంట్రీ కౌన్సిల్ లో పెయింటింగ్, డ్రాయింగ్ ఉపాధ్యాయునిగా పనిచేసాడు. తరువాత 1967లో యు.ఎస్ వెళ్ళి 1969లో చిన్‌సిన్నాటి విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.అచట ఆయన టీచింగ్ అసిస్టెంటుగా 1969 వరకు పనిచేసాడు. తరువాత వెస్టెర్న్ కెంటుకీ విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ విభాగంలో ప్రొఫెసరుగా పనిచేసాడు.తరువాత ఆయన చిగాగో వెళ్లాడు.

లండన్ లోని టాటా గ్యాలరీ, న్యూయార్క్ లోని మెట్రొపోలియన్ మ్యూసియం ఆర్ట్స్ నందు ఆయన చిత్రించిన చిత్రాలను చేడవచ్చు.ప్రపంచంలో అనేక ఆర్ట్ గ్యాలరీలలో,మ్యూజియం లలో ఆయన చిత్రాలు ఉన్నాయి.

ఆయన చిత్రకళ, కవిత్వం పరంగా ప్రసిద్దుడు. ఆయన సుగుణ ను వివాహమాడాడు. వారికి ఒక కుమార్తె(పద్మావతి) జన్మించింది. ఆమె భరతనాట్యంలో సుపరిచితురాలు 

అవార్డులు, గుర్తింపులు సవరించు
లార్డ్ క్రాప్ట్ అవార్దు - 
కామన్వెల్త్ లో ప్రతిభావంతుడైన కళాకారునిగా గుర్తింపు
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్.
ఆయన జీవిత చరిత్ర అమెరికా, వాషింగ్‌టన్ లలో ప్రతిభావంతులైన విద్యావేత్తలుగా గుర్తింపబడినది.రచ్చ గెలిచినా ఇల్లు గుర్తించని గొప్ప చిత్రకారులు...

గుడివాడ చరిత