Thursday, October 22, 2020

శ్రీ పామర్తి సుబ్బారావు


శ్రీ పామర్తి సుబ్బారావు గారు (సెప్టెంబర్ 8, 1922 - జనవరి 28, 2004)  గుడివాడ..
నాటి ప్రముఖ రంగస్థల నటులు దర్శకులు, క్రీడాకారులు.

సుబ్బారావుగారు 1922, సెప్టెంబర్ 8న శ్రీరాములు, మాణిక్యాంబ దంపతులకు గుడివాడలో జన్మించారు

రంగస్థల ప్రస్థానం 
చిన్నప్పటి నుంచి నాటక ప్రదర్శనల పట్ల ఆసక్తివున్న సుబ్బారావు గారు తన సహచరులైన సూరపనేని ప్రభాకరరావు, హెచ్.వి. చలపతిరావు, దాసరి తిలకం, పువ్వుల అనసూయ మొదలైన వారితో కలిసి నాటకాలు వేయడం ప్రారంభించారు..నట సామ్రాట్ అక్కినేని సహాధ్యాయి...మిత్రులు..
 తన బృందంతో 'తెలుగుతల్లి' నాటకాన్ని విస్తృతంగా ప్రదర్శించారు. 1939లో తెలుగుతల్లి నాటకాన్ని విజయవాడలో ప్రదర్శించినప్పడు తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి ముగ్ధులై పామర్తికి 'హాస్యరత్న' బిరుదు ప్రదానం చేసి ఆశీర్వదించారు. ‘పల్లెపడుచు'లో గంగులు పాత్ర 'సుల్తానీ'లో పరమానందం, 'ఎవరు దొంగ'లో దొంగ వంటి పాత్రలే పోషించారు.

బొబ్బిలియుద్ధం, సత్యహరిశ్చంద్రీయం, మహాకవి కాళిదాసు, చంద్రగుప్త, రంగూన్ రౌడీ మొదలైన పద్య నాటకాలను ప్రదర్శించారు. శ్రీ ప్రభాకర నాట్యమండలి సంస్థ పేర అనేక ప్రదర్శనలు ఇచ్చారు. పినిశెట్టి శ్రీరామమూర్తి రచించిన 'పల్లెపడుచు' నాటకంలో గంగులు పాత్ర అద్భుతంగా పోషించేవారు. 1951లో తెనాలిలో జరిగిన పోటీలలో ఆత్రేయ రచించిన ఎవరు దొంగ నాటికను ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శనకు, నటనకు బహుమతులందుకున్నారు. ప్రముఖ కళాకారులైన కైకాల సత్యనారాయణ, పుష్పకుమారి, రేడియో ఏకాంబరం, జాలాది రాజారావు, జి.వి. ప్రసాదరావు, నిర్మలమ్మ, హేమలత, అమ్ముల పార్వతి మొదలైనవారు పామర్తి శిక్షణలో నటనను నేర్చుకున్నారు. పామర్తి దర్శకత్వం వహించిన ఆరు స్త్రీ పాత్రలున్న 'చావకూడదు' నాటిక ఆంధ్ర నాటక కళాపరిషత్తు నాటక పోటీలో ఉత్తమ నటి, ద్వితీయ ఉత్తమ ప్రదర్శన బహుమతులను అందుకుంది.

వేలూరి శివరామ శాస్త్రి రచించిన రేడియో నాటికను ప్రదర్శనకు అనుగుణంగా రాసి, అందులో పరమానందం పాత్రలో నటించాడు. 1961లో నాటక కళాపరిషత్తులో 'సుల్తానీ' నాటికను మనోజ్ఞంగా ప్రదర్శించడం, దానికి ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకత్వం బహుమతులు గెలుచుకోవడం జరిగింది. సుల్తానీ పామర్తి నట జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది.

సన్మానాలు – పురస్కారాలు సవరించు
1991లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంల 'గౌరవ పురస్కారం'
1993లో అక్కినేని కళాపీఠం పురస్కారం
1994లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు పురస్కారం
1997లో అంబేద్కర్ జీవన సాఫల్య పురస్కారం
1997లో కళాజగతి రంగస్థల పురస్కారం
1999లో శ్రీకళానికేతన్ (హైదరాబాద్) జూలూరి వీరేశలింగం కల్చరల్ అవార్డు
గుర్తింపులు సవరించు
గుడివాడలో సుబ్బారావు కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించండమేకాకుండా, పామర్తి నివసించిన వీధికి 'పామర్తి సుబ్బారావుగారి వీధి' అని నామకరణం చేశారు.
సుబ్బారావు 2004, జనవరి 28న దివంగతులయ్యారు..

No comments:

Post a Comment

గుడివాడ చరిత