Thursday, October 22, 2020

శ్రీ నార్ల తాతారావు

దేశములో గల విద్యుత్నానిపుణులలో మేటి తాతారావు నార్ల....అయన అప్పాయింట్మెంట్ కొరకు అంతర్జాతీయప్రైవేటు కంపనీలు పడేవి.. బార్లా... .......
ఆయనేతాతారావు నార్ల....ప్రఖ్యాత భారత విద్యుత్తు రంగ నిపుణుడు, పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు బోర్డు మాజీ ఛైర్మన్.
నార్ల తాతారావు కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో 1917 సెప్టెంబర్ నెల, 4వ తేదీన జన్మించారు. కౌతవరంలోనే ప్రాథమిక విద్యనభ్యసించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి 1941లో ఇంజినీరింగ్ పట్టా పొందారు. అమెరికా లోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఎంఎస్‌ డిగ్రీ చదివిన తాతారావు మొదట టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో ఉద్యోగిగా జీవితము ప్రారంభించారు. పిదప ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్తు సంస్థ (ఏపీఎస్‌ఈబీ) డివిజనల్‌ ఇంజినీరుగా ఉద్యోగ జీవితం మొదలు పెట్టారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌ విద్యుత్తు బోర్డులో పనిచేసిన కాలంలో దేశంలోనే ఆ సంస్థను అగ్రగామిగా నిలిపారు. థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల డిజైన్లను మార్చడంద్వారా ఈ రంగంలో పెద్ద విప్లవమే తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ డిజైన్లు దేశానికంతటికీ ఆదర్శమయ్యాయి. 1974 నుంచి 1988 వరకూ 14 ఏళ్లపాటు ఏపీఎస్‌ఈబీ ఛైర్మన్‌గా పనిచేసారు. విద్యుత్తు రంగానికి విశిష్ట సేవలందించినందుకుగాను 1983 లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది.
నాగార్జున సాగర్, శ్రీశైలం, దిగువ సీలేరు లలో విద్యుత్ ఉత్పాదక సామర్ధ్యము పెంచడంలో ప్రముఖ పాత్ర వహించారు.
రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వడాన్ని నార్ల తాతారావు గట్టిగా సమర్థించారు.. పేదలకు తక్కువ ధరకే విద్యుత్తు అందజేయాలనేది ఆయన లక్ష్యం. విద్యుత్తుతో వ్యాపారం చేయవద్దనేది ఆయన నినాదం.
శ్రీ నార్ల తాతారావు 2007 ఏప్రిల్ 7 న హైదరాబాద్ నగరంలో గుండెపోటుతో మరణించారు.
 ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు తాతారావుకు సోదరుడు
డివిజనల్ ఇంజినీర్, మధ్య ప్రదేశ్ విద్యుత్ శాఖ కార్యదర్శి, విద్యుత్ బోర్డు, మధ్య ప్రదేశ్
ఛీఫ్ ఇంజినీర్, మధ్య ప్రదేశ్ విద్యుత్ శాఖ
ఛైర్మన్, మధ్య ప్రదేశ్ విద్యుత్ శాఖ
సభ్యుడు, కేంద్ర ప్రభుత్వ జల విద్యుత్ కమీషన్
ఛైర్మన్, సూపర్ ధర్మల్ పవర్ స్టేషన్స్ కమిటీ
ఛైర్మన్, ఎనర్జీ రీసర్చ్ శాఖ, భారత శాస్త్ర సాంకేతిక పరిశోధక పరిషత్
అధ్యక్షుడు, కేంద్రీయ జల విద్యుత్ సమితి
డైరెక్టర్, భారత అల్యూమినియమ్ కంపెనీ
అడ్వైజర్, బాంగ్లాదేశ్ పవర్ డెవలప్ మెంట్ బోర్డ్
ఓమ్ ప్రకాశ్ భాసిన్ పురస్కారము
పద్మ శ్రీ 1983
గౌరవ సభ్యుడు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అసోసియేషన్, అమెరికా
భారతరత్న, శ్రీ విశ్వేశ్వరయ్య అవార్డు 1985

No comments:

Post a Comment

గుడివాడ చరిత